పశ్చిమలో 11 నామినేషన్లు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:25 AM
పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
పశ్చిమలో 11 నామినేషన్లు
వన్టౌన్, ఏప్రిల్ 24: పశ్చిమ నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆరవరోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు భవానీపురంలోని రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి తరఫున కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అడ్డూరి శ్రీరామ్, వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తరఫున పి.శ్రీనివాసరావు నామినేషన్లు చేయగా సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫున షేక్ ఖాజావలీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఎన్. దేవసహాయం, జైభారత్ నేషనల్ పార్టీ తరుఫున పోతిన రామారావు, ఇండిపెండెంట్గా వై.వినోద్కుమార్, స్టూడెంట్ యూనైటెడ్ నేషన్ పార్టీ తరఫున కొణకి వెంకటేశ్వరరావు, సమాజ్ వాది పార్టీ తరఫున కె.రమణప్రసాద్, ఇండిపెండెంట్లుగా లొల్ల చంద్రశేఖర్, మరొకరు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్లను పశ్చిమ రిటర్నింగ్ అధికారి కిరణ్మయి స్వీకరించారు.