Share News

Kesineni Nani: వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

ABN , Publish Date - Jan 01 , 2024 | 01:44 PM

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు.

Kesineni Nani: వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు. నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలే జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.

ఈ ప్రభుత్వంపై ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని... ఎటువంటి సందేహమూ లేదన్నారు. విజయవాడ పార్లమెంట్‌లో ఉన్న 16లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని.. తాను కూడా వాళ్లతో ఉంటానని కేశినేని నాని అన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 01:44 PM