Share News

యువత చూపు లోకేష్‌ వైపు..

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:51 PM

రాష్ట్ర యువత టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ వైపు చూస్తోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్‌ తెలిపారు.

యువత చూపు లోకేష్‌ వైపు..
సమావేశంలో మాట్లాడుతున్న పంతగాని నరసింహ ప్రసాద్‌

టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని

రైల్వేకోడూరు(రూరల్‌) ఫిబ్రవరి 12: రాష్ట్ర యువత టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ వైపు చూస్తోందని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేఖరులతో మాట్లాడారు. భూ కజ్జాలు, లిక్కర్‌ , ఇసుక మాఫి యాపై వైసీపీ నాయకులు పెట్టిన శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై పెట్టి ఉంటే యువతకు ఉద్యోగావకా శాలు పుష్కలంగా ఉండేవన్నారు. త్వరలో జరగ నున్న సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ జనసేన పార్టీలకు ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు బొక్కసం చలపతి, తెలుగు యువత నాయకులు బొక్కసం సునీల్‌, కూని చంద్రయ్య, అమర్‌, కస్తూరి దినేష్‌, చిగురుపాటి శంకర, మందపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:51 PM