అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు
ABN , Publish Date - May 21 , 2024 | 11:41 PM
సచివాలయ సిబ్బంది అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ డీవో పోలప్ప హెచ్చరించారు.
![అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు](https://media.andhrajyothy.com/media/2024/20240511/21mpl_mcu6_2136cd8bda.gif)
ములకలచెరువు, మే 21: సచివాలయ సిబ్బంది అనుమతి లేకుం డా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ డీవో పోలప్ప హెచ్చరించారు. మండలంలోని కదిరినాధునికోట గ్రామ సచివాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సమయపాలన పాటించాలన్నారు. సమయపాలన పాటించకపోవడం, అనుమతి లేకుండా విధులకు హాజరుకాక పోతే జీతాలు నిలిపేస్తామన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వ హించాలన్నారు. పనులపై సచివాలయాలకు వచ్చే గ్రామస్థుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.