‘టికెట్ ఇస్తారా.. రాజీనామాలు ఆమోదిస్తారా?’
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:13 PM
గత 15 ఏళ్లుగా టీడీపీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేసిన తమ నాయకుడికి రాయచోటి నియోజకవర్గ టికెట్ కేటాయించడంలో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా మంగ ళవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా లు చేసినట్లు మార్కెట్ యార్డు చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి తెలిపారు.
![‘టికెట్ ఇస్తారా.. రాజీనామాలు ఆమోదిస్తారా?’](https://media.andhrajyothy.com/media/2024/20240215/20_LRP_1_c2f1e7a0b9.gif)
లక్కిరెడ్డిపల్లె, ఫిబ్రవరి 20: గత 15 ఏళ్లుగా టీడీపీ బలోపేతానికి ఆహర్నిశలు కృషి చేసిన తమ నాయకుడికి రాయచోటి నియోజకవర్గ టికెట్ కేటాయించడంలో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా మంగ ళవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా లు చేసినట్లు మార్కెట్ యార్డు చైర్మన్ కాలాడి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి తెలిపారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లెలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 25 ఏళ్లుగా రెడ్డెప్పగారి రమేష్కుమార్రెడ్డి తెలుగదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశాడన ్నారు. అలాంటి నేతకు అన్యాయం జరుగుతుంటే భరించలేక మండల, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జీలందరూ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్ మోహన్ రాజుకు రాజీనామాలు సమర్పించామన్నారు. అదిష్టానం విచారణ చేసి రాయచోటి అసెంభ్లీ టికెట్ రమేష్కుమార్డ్డికి ప్రకటించాలని లేని పక్షంలో రాజీనామాలు ఆమోదిం చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగేంద్రరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీడీపీ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శంకారపు జయరాం, కోనంపేట సర్పంచు లక్ష్మినారాయణ, ధర్మరాజు, అంతుల్లా, రవిశంకర్రెడ్డి, బడుగు వాసుదేవుడు, రవి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంగయ్య, వెంకటరామరాజు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.