వైసీపీని ఓడిస్తాం
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:10 PM
వైసీపీని ఓడించడానికి తాను సిద్ధం అని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు.
![వైసీపీని ఓడిస్తాం](https://media.andhrajyothy.com/media/2024/20240326/3_KDR_2_jpeg_edc4b9784e.gif)
రైల్వేకోడూరు, ఏప్రిల్ 2: వైసీపీని ఓడించడానికి తాను సిద్ధం అని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తెలిపారు. మంగళవారం రైల్వేకోడూరులోని స్వ గృహంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పోరాటం ప్రారంభించా మన్నారు. మొట్టమొదటిగా పిచ్చి తుగ్లక్ వేషంతో ప్రజల్లోకి వెళ్లానన్నారు. రాష్ట్రం బాగుండాలని చంద్రబాబు కోరుకుంటే జగన్ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారన్నారు. ప్రజాదర్బార్ కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైం దన్నారు. కరోనా సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో పాటలు పాడి ప్రజల్ని చైతన్యవంతులుగా చేశామని తెలిపారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజల వెంటే ఉన్నానన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేసులు, దాడులు పెరిగినా కార్యకర్తలకు అండగా నిలిచామని తెలిపారు. కోడూరు నియోజకవర్గంలో ప్రజలకు తోడుగా ఉన్నామని తెలిపారు. అధిష్టానానికి తాను చేసిన పనులు తెలుసునని, ఇంకా సమయం ఉందని, పరిశీలకులు పరిశీలించి అధిష్టానానికి తెలియజేయా లన్నారు. ప్రాణాలకు తెగించి కేడర్ను కాపాడుకున్నామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు బొక్కసం చలపతి మాట్లాడుతూ పార్టీ గందరగోళం లో ఉందన్నారు. టిక్కెట్టు జనసేనకు కేటాయించగా, అభ్యర్థి కార్యకర్తల సమావేశం నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడన్నారు. పంతగాని నరసింహప్రసాద్ ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉన్నాడన్నారు. మేమంతా టీడీపీలోనే ఉంటామన్నారు. గెలుపు దిశగా ఉన్న రైల్వేకోడూరు స్థానాన్ని గందరగోళంలోకి నెట్టేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అధిష్టానం న్యాయం చేస్తాదని అనుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు యువత నాయకులు బొక్కసం సునీల్, దళిత నాయకులు కూని చంద్రయ్య, నాయకులు బజారు సుబ్రహ్మణ్యం, మండ్ల అమర్నాథ్, కస్తూరి దినేష్, మల్లెం హేమంత్, మస్తాన్, సామాజిక సేవా కార్యకర్త మందపాటి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.