Share News

సమష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:20 AM

ఐకమత్యంతో కలసి పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువ ద్దామని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నియోజకవర్గ యువ నేత దాసరి పల్లె జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

సమష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలి

తంబళ్లపల్లె, జనవరి 4: ఐకమత్యంతో కలసి పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకువ ద్దామని ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నియోజకవర్గ యువ నేత దాసరి పల్లె జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గు రువారం ఆయన తంబళ్లపల్లె మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను వారి స్వగృహాలకు వెళ్లి కలుసుకున్నారు. మండల పర్యటనకు విచ్చేసిన జయచంద్రారెడ్డికి స్థానిక నాయకులు స్థానిక రాజకీయ పరిస్థితులు, సమస్యలను వివరించారు. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ...కార్యకర్తలు ఎవ రూ అఽధైర్యపడోద్దని.. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు ఉత్తమ్‌రెడ్డి, తాతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్ర, శంకర్‌ రెడ్డి, బోయపల్లె శివ, పీర్లమాబు, మాజీ ఉపసర్పంచ సుబ్రమణ్యం, టైల్‌శీన, మ్యూజికల్‌ శివ, జనసేన నాయకుడు నరేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:20 AM