Share News

నందలూరు వాసి సివిల్స్‌లో మెరిశాడు

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:44 PM

యూపీఎస్‌సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్‌ 444వ ర్యాంకు సాధించి నందలూరు కీర్తిప్రతిష్టలు పెంపొందించాడు.

నందలూరు వాసి సివిల్స్‌లో మెరిశాడు
గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్‌

గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్‌కు 444వ ర్యాంకు

నందలూరు, ఏప్రిల్‌ 16: యూపీఎస్‌సీ విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో గొబ్బిళ్ల కృష్ణ శ్రీవాస్తవ్‌ 444వ ర్యాంకు సాధించి నందలూరు కీర్తిప్రతిష్టలు పెంపొందించాడు. నందలూరులోని గొబ్బిళ్ల శంకరయ్య పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. గుంటూరు ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్మీడియట్‌, అనంతపూర్‌లోని జేఎన్టీయూ బీటెక్‌ మెకానికల్‌ బ్రాంచ్‌ను పూర్తి చేశాడు. చెన్నైలోని శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీలో సివిల్స్‌లో శిక్షణ పొందాడు. 2023వ సంవత్సరంలో విడుదల చేసిన గ్రూప్‌-1 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి డిస్ర్టిక్‌ రిజిస్ర్టార్‌గా ఎంపికై ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్క గొబ్బిళ్ల విద్యాదరి నెల్లూరు జిల్లాలోని కందుకూరులో సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బావ కొఠారి సోమశేఖర్‌ అప్పారావు పుదుచ్చేరిలో సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సుజాతమ్మ, అక్క విద్యాధరి ప్రోత్సాహంతోనే సివిల్స్‌లో తాను ర్యాంకు సాధించానని ఈ సందర్భంగా కృష్ణ శ్రీవాస్తవ్‌ తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 11:44 PM