వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన ప్రారంభమైంది
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:00 AM
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మదనపల్లె టీడీ పీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూట మి అభ్యర్థి షాజహానబాషా పేర్కొ న్నారు.
![వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన ప్రారంభమైంది](https://media.andhrajyothy.com/media/2024/20240322/25mpl2_5aa28a66fa.gif)
మదనపల్లె టౌన, మార్చి 25: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మదనపల్లె టీడీ పీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూట మి అభ్యర్థి షాజహానబాషా పేర్కొ న్నారు. సోమవారం స్థానిక సొసై టీకాలనీలోని టీడీపీ సీనియర్ నేత మార్పురి సుధాకర్నాయుడు నివాసం లో సుధాకర్నాయుడు ఆధ్వర్యంలో ముగ్గురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా షాజహానబాషా మాట్లాడుతూ మదనపల్లె పర్యటనలో చంద్రబాబు పలు అంశాలపై ప్రజలకు హామీ ఇవ్వనున్నారన్నారు. అనంతరం స్థానిక బుగ్గవంక వద్ద గంగమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన అక్కడ భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన విజయ వంతంపై నియో జకవర్గంలోని 259 బూత ఇనచార్జులు, ప్రధాన నాయకులతో చర్చిం చారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్చినబాబు, టౌనబ్యాంకు మాజీ చైర్మన ఎన.విద్యాసాగర్, ఎస్ఏ మస్తాన, దొరస్వా మినాయుడు, బీదపల్లె నారాయణ, ఈశ్వర్నాయుడు, రెడ్డిమంజునాథ్, గురునాథ్ యాదవ్ పాల్గొన్నారు.