Share News

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:08 AM

టీడీపీ అభ్యర్థి లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపురంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, జెండాను ఆవిష్కరించారు.

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న విజయమ్మ

కాశినాయన ఫిబ్రవరి 19: టీడీపీ అభ్యర్థి లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువనేత రితీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్సాపురంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గ్రామాల్లో నాయకులు, కార్య కర్తలు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేసి బద్వేల్‌ నియోజక వర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెద్దామన్నారు. కడప టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గుర్విరెడ్డి, జిల్లా టీడీపీ కార్యదర్శి మురళి, మండల టీడీపీ అధ్య క్షుడు ఎం.రాజారెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పి.రవీంద్రారెడ్డి,సర్పంచ్‌ ఖాజావలి పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:08 AM