టీడీపీ- జనసేన సభతో తాడేపల్లె ప్యాలెస్ దద్దరిల్లింది
ABN , Publish Date - Feb 29 , 2024 | 11:39 PM
తాడేపల్లెగూడెంలో టీడీ పీ-జనసేన కలసి ఉమ్మడిగా నిర్వహించిన తెలుగు జన బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి తాడేపల్లెలో సీఎం జగన ప్యాలెస్ దద్దరి ల్లుతోందని టీడీపీ పట్టణ అధ్య క్షుడు జోళెపాలెం భవానిప్రసా ద్, మండల అధ్యక్షుడు దేవరిం టి శ్రీనివాసులు పేర్కొన్నారు.
![టీడీపీ- జనసేన సభతో తాడేపల్లె ప్యాలెస్ దద్దరిల్లింది](https://media.andhrajyothy.com/media/2024/20240229/29mpl_T4_51e926775e.gif)
మదనపల్లె టౌన, ఫిబ్రవరి 29: తాడేపల్లెగూడెంలో టీడీ పీ-జనసేన కలసి ఉమ్మడిగా నిర్వహించిన తెలుగు జన బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి తాడేపల్లెలో సీఎం జగన ప్యాలెస్ దద్దరి ల్లుతోందని టీడీపీ పట్టణ అధ్య క్షుడు జోళెపాలెం భవానిప్రసా ద్, మండల అధ్యక్షుడు దేవరిం టి శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరా చకాలను దోపిడిలపై టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాడుతున్నాయన్నారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. తాడేపల్లెగూడెం సభకు ప్రజలు వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విఽధించినా టీడీపీ, జన సైనికులు రెట్టించిన ఉత్సాహం తో సభలో పాల్గొన్నారని గుర్తుచేశారు. 5 కోట్ల ఆంధ్రు జీవితాల్లో వెలుగులు నింపాలని టీడీపీ, జనసేన కలిశాయ న్నారు. చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ప్రధాన కార్యదర్శి కత్తి లక్ష్మన్న, మీడియా కో ఆర్డినేటర్ యర్రబల్లి వెంకటరమణారెడ్డి, తులసీధర్నాయుడు, మేకల రెడ్డిశేఖర్, కత్తి అరుణ్, ప్రభాకర్, పురుషోత్తం, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు.