పోలి వేణుగోపాలస్వామి ఆలయంలో ‘స్వచ్ఛభారత’
ABN , Publish Date - Jan 14 , 2024 | 11:03 PM
మండలంలోని పోలి చెరువు కట్ట సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆల యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహిం చారు.
![పోలి వేణుగోపాలస్వామి ఆలయంలో ‘స్వచ్ఛభారత’](https://media.andhrajyothy.com/media/2023/20231205/2rjp14_jpeg_d3f9f48539.gif)
రాజంపేట, జనవరి 14 : మండలంలోని పోలి చెరువు కట్ట సమీపంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆల యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత కార్యక్రమం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర సంఘటన మంత్రి రవీంద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈ నెల 22న రామమందిర ప్రతిష్ఠ కార్యక్ర మంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించి నట్లు తెలిపారు, దేశంలోని అన్ని దేవాలయాల్లో, పుణ్య క్షేత్రాలను , గుడిని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిండిబోయిన కృష్ణ యాదవ్, కార్యదర్శి సమ్మెట నరేంద్రరాజు, కోడూరు కో-కన్వీనర్ గాదెల శ్రీనివాసులు, వైబీఎస్ఐ జిల్లా కో-ఆర్డినేటర్ కోడూరు ఆదినారాయణ, చిన్న రాఘవ, సునీల్రెడ్డి, శరత, పుష్కర్, మానస, తోట రామయ్య తదితరులు పాల్గొన్నారు.