Share News

జనసేన, టీడీపీలతోనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:38 PM

జనసేన-టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మదనపల్లె జనసేన నాయకు డు శ్రీరామ రామాంజినేయులు పేర్కొన్నారు.

జనసేన, టీడీపీలతోనే రాష్ట్రాభివృద్ధి

మదనపల్లె, ఫిబ్రవరి 2: జనసేన-టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మదనపల్లె జనసేన నాయకు డు శ్రీరామ రామాంజినేయులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండు, పటేల్‌ రోడ్డు సర్కిల్‌లో 51వ రోజు జనసేన, టీడీపీ నాయకులు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. ఈ సం దర్భంగా పట్టణ వాసులు జనసేన, టీడీపీ నాయకులకు పూలమాలల తో ఘన స్వాగతం పలికారు. శ్రీరామరామాంజినేయులు మాట్లాడు తూ... ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఇదే ఉత్సాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా ముమ్మరంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు జనసేన సిద్దాంతాలను వివరిస్తామ న్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి గెలుపునకు అహర్నిశలూ కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్‌, దారం హరిప్రసాద్‌, శ్రీరామహరిహరన, వరుణ్‌వర్మ, ఉదయ్‌ భాస్కర్‌, చంద్రశేఖర్‌, శంకర, గోపాల్‌, హర్ష, ధరణి, సోము, యాసిన, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 11:38 PM