Share News

పెద్దశేషవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

ABN , Publish Date - May 20 , 2024 | 11:32 PM

స్థానిక ప్రసన్నవెంకటరమణ స్వామి దేవాల యంలో నిర్వహిస్తున్న ఆలయ వార్షికబ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దశేషవాహనంపై శ్రీనివాసుడు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు.

పెద్దశేషవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
పెద్దశేషవాహనంపై ఊరేగుతున్న వేంకటేశ్వరుడు

మదనపల్లె అర్బన, మే 20: స్థానిక ప్రసన్నవెంకటరమణ స్వామి దేవాల యంలో నిర్వహిస్తున్న ఆలయ వార్షికబ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం పెద్దశేషవాహనంపై శ్రీనివాసుడు ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తు న్నారు. ఇందులో భాగంగా ఉదయాన్నే శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వ రుడిని ప్రత్యేకంగా అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారి బ్రహోత్సవాల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామిని ప్రత్యేక వాహనంలో అంకరించి పేద్దశేషవాహనంపై బండమీదకమ్మపల్లెలో, హంస వాహనంపై నెహ్రునగర్‌ పురవీధుల్లో ఊరేగింపు చేశారు. కార్యక్ర మంలో బీజేపాండు, నాగేంద్ర, సాయిచిత్రభాస్కర, మార్పురి విక్కి, టీడీపీ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:32 PM