Share News

వైభవంగా కనక రుద్రమ్మ తిరుణాల

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:42 PM

మండలంలోని దేవరకొండ గుట్ట వద్ద ఆదివారం కనకరుద్రమ్మ తిరుణాల నిర్వహించారు.

వైభవంగా కనక రుద్రమ్మ తిరుణాల
పూజలందుకుంటున్న కనకరుద్రమ్మ

పుల్లంపేట, మార్చి 24: మండలంలోని దేవరకొండ గుట్ట వద్ద ఆదివారం కనకరుద్రమ్మ తిరుణాల నిర్వహించారు. అమ్మవారు తెల్లవారుజామునే పి.వి.జి.పల్లె నుంచి అమ్మవారు దేవరకొండ గుట్టవద్ద ఉన్న ఆలయానికి చేరుకున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు, చిట్వేలి తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలు సేవా సంఘాలు అన్నదానం చేశాయి. సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభించారు. చాందినీ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాహనాలరద్దీ అధికంగా ఉండటంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి భక్తులు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Mar 24 , 2024 | 10:42 PM