Share News

రాజంపేట వైసీపీ ఖాళీ!

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:59 PM

రాజంపేటలో వైసీపీకి మరోషాక్‌ తగిలింది. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రధాన నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోగా బుధవారం మరికొందరు విజయవాడలో లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

రాజంపేట వైసీపీ ఖాళీ!
నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న కొండూరు శరతకుమార్‌రాజు తదితరులు

నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిక

30 వాహనాల్లో హైదరాబాదుకు..

డైరెక్టర్‌ పదవులకు ముగ్గురి రాజీనామా

రాజంపేట, ఏప్రిల్‌17 : రాజంపేటలో వైసీపీకి మరోషాక్‌ తగిలింది. ఇప్పటికే నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రధాన నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోగా బుధవారం మరికొందరు విజయవాడలో లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు పోలి వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గురువారం టీడీపీ అధినేత సమక్షంలో టీడీపీ చేరడానికి 30 వాహనాల్లో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరులు రాజంపేట మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచలు, ఎంపీటీసీలు బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. బుధవారం సాయంత్రం నారా లోకేష్‌ విజయవాడలోని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో రాజంపేట బార్‌ అసోసియేషన మాజీ అధ్యక్షుడు శరతకుమార్‌రాజుతో పాటు, పలువురు క్షత్రియ సంఘం నాయకులు, బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రముఖ మైనారిటీ నాయకులు గుల్జార్‌బాషా, రాష్ట్ర ముదిరాజ్‌ కార్పొరేషన డైరెక్టర్‌ భువనబోయిన లక్ష్మీనరసయ్య, నందలూరుకు చెందిన వక్స్‌బోర్డు కార్యదర్శి అమీర్‌బాషాతమ పదవులకు రాజీనామాలు చేసి హైదరాబాదుకు పయనమయ్యారు.

Updated Date - Apr 17 , 2024 | 10:59 PM