Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:09 PM

మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీలోని అరుంధతి వాడ, చలంపాళెం, గిరిజన కాలనీల్లో ఆదివారం బీజేపీ నా యకులు ప్రజాపోరు కార్యక్ర మాన్ని నిర్వహించారు.

బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు
పోరుబాట కార్యక్రమంలో మాట్లాడుతున్న బీజేపీనాయకులు

రైల్వేకోడూరు, మార్చి 3: మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీలోని అరుంధతి వాడ, చలంపాళెం, గిరిజన కాలనీల్లో ఆదివారం బీజేపీ నా యకులు ప్రజాపోరు కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రజాపోరు కన్వీనర్‌ నానబాల లక్ష్ముణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. కోడూరు అసెంబ్లీ కో-కన్వీనర్‌ తోట శ్రీనివాసులు, జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు దాసర్రాజు జయప్రకాష్‌, నారాయణవర్మ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు తొండం చంద్రశేఖర్‌, తోట లక్ష్మీనారాయణ, తొండం శివయ్య, తొండం పద్మనాభయ్య, గజ్జల వెంకటరమణ, సిద్ధయ్య, కార్తీక్‌, హరీష్‌, చంగల్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:09 PM