Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

సీఎం జగన అపద్దాల హామీలను ప్రజలు నమ్మరు

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:49 AM

సీఎం వైఎస్‌ జగన అపద్దాల హామీలను నమ్మేస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్య క్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.

సీఎం జగన అపద్దాల హామీలను ప్రజలు నమ్మరు

పత్తేపురంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న టీడీపీ, జనసేన నాయకులు

వాల్మీకిపురం, మార్చి 3: సీఎం వైఎస్‌ జగన అపద్దాల హామీలను నమ్మేస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్య క్షుడు మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పత్తేపురం గ్రామం లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మేని ఫెస్టోలోని సంక్షేమ పథకాలను రూపొందించిన కరపత్రాలను ఇంటింటా పంచుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని టీడీపీ, జనసేన ఉమ్మడిగా అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ వల్లిగట్ల వెంకటరమణ, జిల్లా పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, టీడీపీ పీలేరు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ బాషా, రాజంపేట పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాజేంద్రాచారి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు కోసూరి రమేష్‌, నాయకులు పీవీ నారాయణ, చంద్రమౌళి, తెలుగు యువత చాను, కువైట్‌ సయ్యద్‌బాషా, అడ్వకేట్‌ రమణ, స్వర్ణలత, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:49 AM