Share News

పెద్దిరెడ్డి..ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వడం నేర్చుకోండి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:45 PM

రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలని తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన చార్జి జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి..ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వడం నేర్చుకోండి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌

ములకలచెరువు, జనవరి 29: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలని తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన చార్జి జి.శంకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. మదన పల్లెలోని తన నివాసంలో సోమవారం విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీలేరులో జరిగిన టీడీపీ అధినేత చం ద్రబాబు నాయుడు బహిరంగ సభ చూసి వైసీపీలో వణుకు పుట్టిందన్నారు. పీలేరుకు వచ్చిన అశేష జనవాణిని చూసి ఒర్వలేక చంద్రబాబుపై మంత్రి పెద్డిరెడ్డి ఇష్టం వచ్చి నట్లు మాట్లాడు తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి పదవిలో ఉండి అరాచకాలను ప్రోత్స హిస్తున్నా రన్న విషయం ప్రజలకు అర్ధమైం దన్నారు. స్ధానిక సంస్ధల, తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా దొంగ ఓట్లు వేయించుకుని గెలిచారో అందరికి తెలుసునన్నారు. దొంగ ఓట్లతో అన్నయయ్య జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌కు కారణమయ్యారన్నారు. బీసీలపై మీరు ఈ రోజు చూపుతున్న కపటప్రేమ అందరికి తెలుసునన్నారు. వైసీపీ అరాచక దుర్మార్గపు పాలనను సాగనంపేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:45 PM