Share News

మోదీతోనే దేశ ప్రగతి సాధ్యం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:28 PM

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పేర్కొ న్నారు.

మోదీతోనే దేశ ప్రగతి సాధ్యం
తంబళ్లపల్లెలో సంబరాలు చేసుకుంటున్న కూటమి నేతలు

వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూటమి నేతల సంబరాలు

తంబళ్లపల్లె, జూన 9: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పేర్కొ న్నారు. భారతదేశ ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీ కారం చేసిన సందర్భంగా బీజేపీ సీనియర్‌ నాయకుడు లక్ష్మయ్య, అసెం బ్లీ కోకన్వీనర్‌ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి సం బరాల్లో మునిగిపోయారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడు తూ...టీడీపీ, బీజేపీ, జనసేన సారధ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, లక్ష్మయ్య, శంకర్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, అప్పిరెడ్డి, రఘునా థరెడ్డి, రాఘవరెడ్డి, సుబ్బయ్య, జిల్లా ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు రాజేంద్ర నాయక్‌, టీడీపీ నాయకులు శశిధర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మ్యూజికల్‌శివ, చెట్లవా రిపల్లె మధు, అశోక్‌, రామచంద్ర, రమణారెడ్డి, జగదీష్‌, వీరాంజినేయు లు, తెలుగుయువత మధుసూదన, పీర్లమాబు, మల్లేష్‌, శివకు మార్‌, నాగభూషణం, మురళి, రాజారెడ్డి, మునాఫ్‌ పాల్గొన్నారు.

ములకలచెరువులో: మండలంలోని బురకాయలకోటలో ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకు లు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ను కట్‌ చేసి మిఠా యిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ముత్తుకూరు మౌళా, జేసీబీ సుధాకర్‌నాయుడు, విజయ్‌కుమార్‌, రామకృష్ణమరాజు, గోపాల్‌రాజు, మస్తానరెడ్డి, కేవవరెడ్డి, ఫజురుల్లా, తిప్పరాజు, బీజేపీ నాయకులు నాగరాజు, రామకృష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, జనసేన నాయకులు రెడ్డి, శ్రీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి వరుసగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా గుర్రంకొండలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా బస్టాండులో కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అనంతరం బాణసంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు జగదీష్‌కుమార్‌, రామాంజులు, చలమారెడ్డి, సతీష్‌, మేకల చలపతి, రాము, సుధాకర్‌, భరత, దేవిక, మహాత్మారెడ్డి, సుబ్బరాజు, రఘు, భాస్కర్‌, తన్వీర్‌, మౌలా, రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:28 PM