బండ్లపెంట దర్గా ఉత్సవాల్లో మండిపల్లి, సుగవాసి
ABN , Publish Date - Mar 01 , 2024 | 10:45 PM
పట్టణంలోని బండ్లపెంటలో యూసుఫ్షా ఖాదిరి దివా నే సాహెబ్ దర్గా 66వ ఉరుసు శుక్ర వారం ఘనంగా ప్రారంభైంది.
రాయచోటిటౌన్, మార్చి1: పట్టణంలోని బండ్లపెంటలో యూసుఫ్షా ఖాదిరి దివా నే సాహెబ్ దర్గా 66వ ఉరుసు శుక్ర వారం ఘనంగా ప్రారంభైంది. గంధం ఉత్సవంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సుగవాసి సుబ్ర మణ్యం, రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి హాజర య్యారు. వీరికి దర్గా కమిటీ ప్రెసిడెంట్, మాజీ కోఆప్షన్ సభ్యులు సల్లావుద్దీన్, కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సం దర్భంగా మండిపల్లి రాంప్రసాద్రెడ్డి దివానే సాహెబ్ దర్గాలో చాదర్ను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాయచోటిలో హిందూ, ముస్లింలు అందరూ తెలుగుదేశం పార్టీని ఆద రించాలని కోరారు. పూల వ్యాపారి మదనీబాషా, మాజీ సర్పంచ్ నాగేశ్వర్నాయుడు, మైనార్టీ సోదరులు సగదీర్, మస్తాన్, అస్రప్, షాహుల్, దర్గా షరీఫ్, ఇమ్రాన్, శివ,రమేశ్, సాంబశివరెడ్డి, కొండా తదితరులు పాల్గొన్నారు.