జగన్ ఓటమి.. చంద్రబాబు విజయం తఽథ్యం
ABN , Publish Date - Feb 17 , 2024 | 11:02 PM
రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్రెడ్డి ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తఽథ్యమని టీడీపీ సీనియర్ నేత రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు పోలి సుబ్బారెడ్డి వెల్లడించారు.
![జగన్ ఓటమి.. చంద్రబాబు విజయం తఽథ్యం](https://media.andhrajyothy.com/media/2024/20240215/1rjp17_jpeg_305080b265.jpg)
రాజంపేట, ఫిబ్రవరి 17: రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్రెడ్డి ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం తఽథ్యమని టీడీపీ సీనియర్ నేత రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమల అధినేత డాక్టర్ జీఎన్ నాయుడు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు పోలి సుబ్బారెడ్డి వెల్లడించారు. డాక్టర్ జీఎన్నాయుడు రాజంపేటకు వచ్చిన సందర్భంగా రీజెన్సీ నలందా ప్రాంగణంలో పోలి సుబ్బారెడ్డి శనివారం ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనకు రాజంపేట టికెట్టు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఈ విషయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు తెలియజేసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తూ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. జగన్ను ఓడించకపోతే రాష్ట్రం అధోగతిపాలవుతుందన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు టీడీపీ, జనసేన అధికారంలోకి రావాలని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును స్పష్టంగా తెలియజేయనున్నారన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పాలనకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అంశంలో చిత్తశుద్ధితో కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రనాయుడు పాల్గొన్నారు.