ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన
ABN , Publish Date - Jan 28 , 2024 | 11:56 PM
సీఎం జగనమెహనరెడ్డి తన స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జనసేన నియోజక వర్గ నేత శ్రీరామ రామాంజనేయులు ఆరోపించారు.
![ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన](https://media.andhrajyothy.com/media/2023/20231205/28mpl3_28b9369615.gif)
ఫజనసేన నేత శ్రీరామ రామాంజనేయులు
మదనపల్లె, జనవరి 28: సీఎం జగనమెహనరెడ్డి తన స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జనసేన నియోజక వర్గ నేత శ్రీరామ రామాంజనేయులు ఆరోపించారు. జనంకోసం జన సేన కార్యక్రమంలో భాగంగా 48వరోజు ఆదివారం పట్టణంలోని టౌనబ్యాంకు సర్కిల్, బర్మావీధి, సీటీఎం రోడ్డు ఏరియాలలో పర్యటిం చారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ పథకాల ప్రచారం పేరుతో సీఎం జగన తన ఫొటోలను బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్పా..ప్రజలకు ఒరిగిందేమీలేదని విమ ర్శించారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వానికి రోజు వారి నడిపేందుకు, ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన నకిలీ మద్యాన్ని అమ్మకాలు చేపట్టి వారి ప్రాణాలను హరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, ఆరోగ్యభద్రత కల్పించనున్నట్లు ఆయన వివరిస్తూ, ఈ రెండు పార్టీల మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరిప్రసాద్, నాయని జగదీష్, రిటైర్డ్ రెవెన్యూ అధికారి గోపాల్, వీరమహిళలు రూప, పద్మావతి, ప్రభావతి, అశ్వత, కుప్పాల శంకర్, ధరణి, సోను, సుప్రీం హర్ష, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.