Share News

వైసీపీ పాలన అసమర్థతకు నిదర్శనం

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:57 PM

ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పాలన అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు తెలిపారు. బుధవారం సుండుపల్లె మండల కేంద్రంలోని జనార్దనరెడ్డినగర్‌, ఇందిరానగర్‌, అరెమ్మవీధితో పాటు పలు వీధుల్లో టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగబాసి బాలసుబ్రమణ్యంకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

వైసీపీ పాలన అసమర్థతకు నిదర్శనం
కటారుముడుకు గ్రామస్తులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్న ప్రసాద్‌బాబు

సుండుపల్లె, ఏప్రిల్‌ 17: ముఖ్యమంత్రి జగనమోహనరెడ్డి పాలన అసమర్థ పాలనకు నిలువెత్తు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు తెలిపారు. బుధవారం సుండుపల్లె మండల కేంద్రంలోని జనార్దనరెడ్డినగర్‌, ఇందిరానగర్‌, అరెమ్మవీధితో పాటు పలు వీధుల్లో టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి సుగబాసి బాలసుబ్రమణ్యంకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీ కటారుముడుకుకు చెందిన 20 కుటుంబాలు, మడితాడు గ్రామ పంచాయతీకి చెందిన 15 మైనార్టీ కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. మండల అధ్యక్షుడు రెడ్డెప్ప, క్లస్టర్‌ ఇనచార్జి శివకుమార్‌నాయుడు, చప్పిడి రమేశనాయుడు, యూనియన బాషా, మేకల మహబూబ్‌బాషా, దామోదర్‌నాయుడు, వెంకటేశ్వర్లునాయుడు, రామాంజులు, వెంకట్రమణ, మాలేపాటి సురేశనాయుడు, ప్రసాద్‌రాజు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌నాయక్‌, ఎస్సీ సెల్‌ పార్లమెంట్‌ ఉపా ధ్యక్షుడు చంద్రమౌళి, జనసేన మహిళా నాయకురాలు రెడ్డిరాణి, రామాశ్రీనివాసులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 10:57 PM