Share News

అయ్యప్పస్వామి ఆలయకమిటీ చైర్మనపై విచారణ

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:18 AM

అయ్యప్ప స్వామి ఆలయకమిటీ చైర్మన రెడ్డెప్ప రెడ్డిపై గురువారం అన్నమయ్యజిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్‌ విచార ణ చేపట్టారు.

అయ్యప్పస్వామి ఆలయకమిటీ చైర్మనపై విచారణ
ఛైర్మనను విచారిస్తున్న దేవదాయశాఖాధికారి విశ్వనాథ్‌

మదనపల్లె అర్బన, జనవరి 4: అయ్యప్ప స్వామి ఆలయకమిటీ చైర్మన రెడ్డెప్ప రెడ్డిపై గురువారం అన్నమయ్యజిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్‌ విచార ణ చేపట్టారు. ఆలయం చేరుకున్న ఆయన అయ్యప్పస్వాముల సమక్షంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేశారు. ఇందులో హిందూ ఐక్యవేదిక, బహుజన యువసేన నాయకులుతో కలిసి అయ్యప్పస్వామి ఆలయంలో జరుగుతున్న సంఘటనలు, ఆర్థిఽక లావాదేవాలు, పూజారుల నియామకం, బిల్లుబుక్కులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి సమస్యలపై అయ్యప్పస్వాముల వద్ద, ఇతరులు వద్ద లిఖితపూర్వకంగా వాస్తవాలను క్రోడికరించి దేవదాయశాఖ కమిష నర్‌కు నివేధించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇనస్పెక్టర్‌ రవికుమా ర్‌రెడ్డి, గ్రూప్‌టెంపుల్‌ ఈవో రమణ, సిబ్బంది అంకన్న, రాజశేఖర్‌, పురుషోత్తం, ఎస్‌ఐ రవికుమార్‌, పోలీసులు, అయ్యప్పస్వామి మాలదారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 12:18 AM