Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:56 PM

తంబ ళ్లపల్లె మండలంలో సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్ని కల పరిశీలకులు కవిత మన్ని కేరి శుక్రవారం పరిశీలించారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన
పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు కవిత

తంబళ్లపల్లె, ఏప్రిల్‌ 26: తంబ ళ్లపల్లె మండలంలో సమస్యా త్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్ని కల పరిశీలకులు కవిత మన్ని కేరి శుక్రవారం పరిశీలించారు. స్థానిక జూనియర్‌ కాలేజిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి ఓటర్లకు సౌకర్యాలు తదితర అం శాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా సమ స్యలు తలెత్తితే పోన నెం:8977949222కు సమాచారం ఇవ్వాలని సూ చించారు. కార్యక్రమంలో తహసీల్దారు బ్రహ్మయ్య, ఎన్నికల అధికారు లు, ఎస్‌ఐ శివకుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కురబలకోటలో: ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల పరిశీలకురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ర్టాంగ్‌ రూములను ఆమె పరిశీలించారు. ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగళ్ళు పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 11:56 PM