Share News

టీడీపీని గెలిపిస్తే ఝరికోన ప్రాజెక్టు నీరు అందిస్తాం

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:46 PM

టీడీపీ అధి కారంలోకి రాగానే సంబేపల్లె మండ ల రైతులకు ఝరికోన ప్రాజెక్టు ద్వా రా సాగు, తాగునీరు అందిస్తామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు

టీడీపీని గెలిపిస్తే ఝరికోన ప్రాజెక్టు నీరు అందిస్తాం
కార్యకర్తలతో కలిసి వెళుతున్న మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి

సంబేపల్లె, జనవరి 12: టీడీపీ అధి కారంలోకి రాగానే సంబేపల్లె మండ ల రైతులకు ఝరికోన ప్రాజెక్టు ద్వా రా సాగు, తాగునీరు అందిస్తామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం శెట్టిపల్లె గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యతు ్తకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా రెడ్డిమల్లువారిపల్లె, ఎర్ర మొరంపల్లె, సదిపిరివాండ్లపల్లె, చెరుకువాండ్లపల్లె, వల్లబండపల్లె, నాయునివారిపల్లె, మర్రి మాకులపల్లె, దొడ్డి సిద్దయ్యయగారిపలె ్లల్లో గడప గడపకు తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి టీడీపీకి పట్టం కట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ మల్లు విష్ణువర్థన్‌రెడ్డి, టీడీపీ నాయకులు కాలాడి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు చిన్న రెడ్డెయ్య యాదవ్‌, తెలుగు యువత కూనాసి హరిరాహుల్‌, క ల్యాణ మండపం రమణ, టీడీపీ కా ర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట: రాజంపేట మండలం ఆర్‌.బుడుగుంటపల్లెలో బాబు ష్యూరి టీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బనరసయ్య నాయుడు, యూనిట్‌ ఇన్‌చార్జి సంగమేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

వీరబల్లి: మండలంలోని ఓదివీడు గ్రామ పంచాయతీ బెస్తపల్లె, రామాపురంలలో మండల టీడీపీ అధ్యక్షుడు భానుగోపాల్‌రాజు మాట్లాడుతూ తెలుగుదేశం చంద్రబాబుతోనే ఈ రాష్ర్టానికి భవిష్యత్తు ఉందన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు జగిలి రామచంద్ర, బూత్‌ ఇన్‌చార్జిలు సిద్దిరాజు, సుధాకర్‌, సీనియర్‌ నాయకులు రెడ్డిశేఖర్‌రాజు, మండల ఉపాధ్యక్షుడు దుర్గం ఆంజనేయులు, తెలుగు యువత నాయకుడు పోరుమామిళ్ల చలపతి, ఐటీడీపీ పవన్‌కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:46 PM