జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలి
ABN , Publish Date - Mar 26 , 2024 | 10:33 PM
రాష్ట్రంలో జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలిపారు.
![జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలి](https://media.andhrajyothy.com/media/2024/20240326/26mpl_mcu3_a92189a3d0.gif)
ఫతంబళ్ళపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి
ములకలచెరువు, మార్చి 26: రాష్ట్రంలో జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, పెద్దమండ్యం మండలాల క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, పోలింగ్ బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బతికించు కోవాలంటే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలన్నారు. ఒక్క చాన్సు పేరు తో అధికారంలో వచ్చిన జగన్రెడ్డి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశాడన్నారు. రాష్ట్రంలోని వనరులను దోపిడీ చేసి అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజాస్వామ్యం బతకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. టీడీపీ అధికారంతోకి రాగానే నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ పథకాలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించి పోలింగ్ బూత్ పరిధిలో చేపట్టిన శంఖారావం కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్తాజ్, తంబళ్ళపల్లె నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడ్ మల్లికార్జుననాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ విధ్వంస, అరాచక, అవినీతి పాలనను సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, నారాయణస్వామిరెడ్డి, అనందరెడ్డి, రెడ్డెప్పరెడ్డి, వైజీ సురేంద్రయాదవ్, సంపతికోట సర్పంచ్ రెడ్డెప్ప, పులికల్లు మాజీ సర్పంచులు శ్రీనివాసులురెడ్డి, కట్టా వెంటరమణనాయుడు, నాయకులు డేరంగుల నారాయణ, మొటుకు శివ, మాధవరెడ్డి, చంద్రమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రచార సమన్వయకర్తకు సన్మానం
తంబళ్ళపల్లె నియోజకవర్గ ప్రచార సమన్వయకర్తగా ఎంపికైన సీడ్ మల్లికార్జుననాయుడుని తంబళ్ళపల్లె ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఘనంగా సన్మానించారు. మదనపల్లెకు చెందిన సీనియర్ టీడీపీ నేత మల్లికార్జుననాయుడుని తంబళ్ళపల్లె ప్రచార సమన్వయకర్తగా నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం జయచంద్రారెడ్డితో కలిసి సీడ్ మల్లికార్జుననాయుడు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీలో గ్రూపులు లేవని అంతా ఒకే కుటుంబమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వీన్తాజ్ మాట్లాడుతూ జయచంద్రారెడ్డి గెలుపు కోసం అందరం కష్టపడి పనిచేద్దామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు పాలగిరి సిద్ధా, వైజీ సురేంద్రయాదవ్, రెద్దెప్పరెడ్డి, ఆనందరెడ్డి, నారాయణస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా, వైజీ సురేంద్రయాదవ్, రెద్దెప్పరెడ్డి, ఆనందరెడ్డి, నారాయణస్వామిరెడ్డి తదితరులు మల్లికార్జుననాయుడును సన్మానించారు.