గురుకుల విద్యా విధానాన్ని పునరుద్ధరించాలి
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:22 PM
గురుకుల విద్యావిధానా న్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడలి శృంగేరి మహాసంస్థానం, దక్షిణామ్నా య శారదాపీఠం 72వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ శంకరభారతి స్వామి తెలిపారు.
బి.కొత్తకోట, జూలై 3: గురుకుల విద్యావిధానా న్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కూడలి శృంగేరి మహాసంస్థానం, దక్షిణామ్నా య శారదాపీఠం 72వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవ శంకరభారతి స్వామి తెలిపారు. మం డలంలోని గట్టు పంచాయతీలో వేద వ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుషి వాటిక గురుకులాన్ని ఆయన సందర్శించారు. గురుకుల భవనానికి భూమి పూజచేశారు. అ నంతరం వేదాలు, సనాతనధర్మం, గురు కులాలు, ప్రస్తుత విద్యా విధానాలు, నైతిక విలువలు, పీఠాలస్థాపన, వాటి ఆవశ్యకత, భారతీయ సంప్రదాలు తదితర అంశాలపై ధార్మికోపన్యాసం చేశారు. కార్యక్రమంలో వేద వ్యాస ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జీయస్రాజు, ట్రస్టీలు శాంతారాణి, గంగాధర్, ఉమాభారతి, గురుకుల నిర్వాహకులు రవికుమార్శర్మ, ఆ చార్యులు రాకేష్, గాయత్రీభరధ్వాజ, వెంకట్, విశ్వం విద్యాసంస్థల అధినేత ప్రభాకర్రెడ్డి, ప్రకృతివనం ప్రసాద్, రాఘవన రఘురాం, యంఈవో రెడ్డిశేఖర్, వైధ్యసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారెడ్డి, ప్రొఫెసర్ ముప్పాళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.