Share News

చంద్రబాబుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:41 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి గ్యారంటీ అని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పే ర్కొన్నారు.

చంద్రబాబుతోనే భవిష్యత్తుకు గ్యారంటీ
వాల్మీకిపురంలో ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు

వాల్మీకిపురం, ఫిబ్రవరి 20: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడితోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి గ్యారంటీ అని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి పే ర్కొన్నారు. మంగళవారం పట్టణం లో బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిం చారు. స్థానిక వాల్మీకినగర్‌, బీడీ కాలనీ, ఎనటీఆర్‌ కాలనీ, రామ్‌నగర్‌ తదితర ప్రాంతా లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ-జనసేన మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథ కాల పట్ల కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతోందన్నారు. సీఎం జగన మళ్లీ ఎన్నికల ముందు కళ్లబొల్లి మాటలతో మభ్యపెట్టాలని చూస్తే నమ్మేవారెవరూ లేరన్నారు. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నిం చారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పరాభవం తప్పదని, ప్రజలు కూడా జగన ను ఇంటికి సాగునంపడానికి సంసిద్ధులయ్యారన్నారు. కార్యక్రమంలో పీలేరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లంకిపల్లి మధు, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌, నాయకులు రాజేం ద్రాచారి, పీవీ నారాయణ, చంద్రమౌళి, డిష్‌ బ్రదర్స్‌, కోసూరి రమేష్‌, స్వర్ణలత, మురళి, న్యాయవాధి రమణ, కువైట్‌ సయ్యద్‌బాషా, బొక్కసం ఆనంద్‌, చాను, రామాంజులురెడ్డి, సాదిక్‌, సర్దార్‌, మౌలా, సైదు, బషీర్‌, రమణ, అబ్బాస్‌, సయ్యద్‌, అమీర్‌, లోకేష్‌, మస్తాన వలి, ఆదినారాయణ, రెడ్డిరామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:41 PM