టీడీపీ బలోపేతానికి ఫోర్మెన కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:17 PM
మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి, సూ పర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడా నికి ఫోర్మెన కమిటీని నియమించామని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు.
![టీడీపీ బలోపేతానికి ఫోర్మెన కమిటీ ఏర్పాటు](https://media.andhrajyothy.com/media/2023/20231205/30mpl_T2_63cd1855d6.gif)
మదనపల్లె టౌన, జనవరి 30: మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి, సూ పర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడా నికి ఫోర్మెన కమిటీని నియమించామని మదనపల్లె టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ పేర్కొన్నారు. మంగళవా రం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫోర్మెన కమిటీలో పొలిటికల్ మేనేజర్గా కత్తి లక్ష్మన్న, మీడియా కోఆర్డినేటర్గా ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, అడ్మిని సే్ట్రటివ్ మేనేజర్గా మల్లెం ప్రకాష్నాయుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కాశీ శ్రీరామ్లను నియమించామన్నారు. వారికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా పనిచేస్తూ ఈ రెండున్నర నెలలు కష్టపడాలని సూచించారు. కాగా ఫోర్మెన కమిటీని స్థానిక టీడీపీ నాయకులు అభినందించారు.