Share News

ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:34 PM

ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చని జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీల కుడు దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ పేర్కొ న్నారు.

ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చు
మదనపల్లె జడ్పీ హైస్కూల్లో సా్ట్రంగ్‌రూమ్‌ వద్ద భద్రతను పరిశీలిస్తున్న అబ్జర్వర్‌ నవాజ్‌ అహ్మద్‌

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 24: ఓటు హక్కు వున్న ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయవచ్చని జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీల కుడు దిల్‌ నవాజ్‌ అహ్మద్‌ పేర్కొ న్నారు. బుధవారం మదనపల్లె జడ్పీ హైస్కూల్‌, తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మిట్స్‌ కళా శాల వద్ద ఏర్పాటు చేసిన సా్ట్రంగ్‌ రూమ్‌లను అబ్జర్వర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. సా్ట్రంగ్‌ రూమ్‌ వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టు టౌన సీఐ యువరాజు, ఎస్‌ఎస్‌బీ ఫోర్సు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:34 PM