వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మవద్దు
ABN , Publish Date - Mar 22 , 2024 | 11:37 PM
టీడీపీ, బీజే పీ, జనసేన కూటమిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్ర చారాలను నమ్మవద్దని కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూజా రెడ్డి ప్రజలను కోరారు.
![వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మవద్దు](https://media.andhrajyothy.com/media/2024/20240322/22_Plr05_28ae28a50d.gif)
పీలేరు, మార్చి 22: టీడీపీ, బీజే పీ, జనసేన కూటమిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్ర చారాలను నమ్మవద్దని కూటమి అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూజా రెడ్డి ప్రజలను కోరారు. పీలేరు పట్టణంలోని జెండామాను, గాంధీ రోడ్డు, పాతకోట వీధి, కొత్తకోట వీధి, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో ఆమె తన భర్త నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలోనూ టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు రాష్ట్రంలోని మైనారిటీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్న ఘనత టీడీపీకి ఉందన్నారు. టీడీపీ తరహాలో తమ కుటుంబం కూడా అనాదిగా ముస్లిం మైనారిటీల వెంట నడిచిందని గుర్తించాలని ఆమె తెలిపారు. వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మకుండా వచ్చే ఎన్నికల్లో తన భర్తను గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలు పంచుతూ వాటి గురించి ప్రజల కు వివరించారు. అంతకుమునుపు ఆమె రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని పెద్దపీర్ల చావిడి, కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కార్యక్రమంలో నాయకులు మల్లెల రెడ్డిబాషా, కోటపల్లె బాబు, శ్రీకాంత రెడ్డి, మహమ్మద్ పీర్, షౌకతఅలీ, రియాజ్, ఇస్మాయిల్, అత్తారు చాను, రహంతుల్లా, ఫిరోజ్, బుజ్జు, కేజీఎన రెడ్డిబాషా, లక్ష్మీకర, కంచి సూరి, పోలిశెట్టి సురేంద్ర, పురం రెడ్డమ్మ, సాధన, మీనా, షమ, రెడ్డిరాణి, సుభద్రమ్మ, రమాదేవి, వాణి, సలీం, పఠాన మౌలా, తదితరులు పాల్గొన్నారు.