Share News

అరాచక వైసీపీని పారద్రోలండి: చమర్తి

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:06 PM

సం క్రాంతి సంబరాల్లో భాగం గా మండల కేంద్రంలోని దిగువపేట గాంధీ వీధిలో క్రికెట్‌ టోర్నమెంటును రా జంపేట పార్లమెంటు తెలు గుదేశం పా

అరాచక వైసీపీని పారద్రోలండి: చమర్తి
బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న చమర్తి జగన్‌మోహన్‌రాజు

సిద్దవటం, జనవరి7 : సం క్రాంతి సంబరాల్లో భాగం గా మండల కేంద్రంలోని దిగువపేట గాంధీ వీధిలో క్రికెట్‌ టోర్నమెంటును రా జంపేట పార్లమెంటు తెలు గుదేశం పార్టీ అధ్యక్షుడు చమర్తి జగన్‌ మోహన్‌ రాజు ఆదివారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రికెట్‌ టోర్నమెంటు నిర్వహించడం చాలా సంతోష కరమన్నారు. రాబోవు ఎన్నికల్లో యువత ఓటు అనే ఆయుధంతో అరాచక వైసీపీని పారద్రోలాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్‌నాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు జ్యోతి మోహన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, దశరఽథనాయుడు, నాగమునిరెడ్డి, శ్రీనివాసులునాయుడు, పిచ్చిరెడ్డి, రాజనాయుడు, చలమయ్య, లక్ష్మయ్య, గాలి సుబ్బయ్య, పార్ల శ్రీనివాసులు యాదవ్‌, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 11:06 PM