టీడీపీ సూపర్సిక్స్ పథకాలపై డిజిటల్ ప్రచారాలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:44 PM
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయనున్న టీడీపీ సూపర్ సిక్స్ పథకా లపై డిజిటల్ టీవీ రథం ద్వారా ప్రచారా లు చేస్తున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి షాజహానబాషా పేర్కొ న్నారు.
![టీడీపీ సూపర్సిక్స్ పథకాలపై డిజిటల్ ప్రచారాలు](https://media.andhrajyothy.com/media/2024/20240326/5mpl_T2_a858b8a29e.gif)
మదనపల్లె టౌన, ఏప్రిల్ 5: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయనున్న టీడీపీ సూపర్ సిక్స్ పథకా లపై డిజిటల్ టీవీ రథం ద్వారా ప్రచారా లు చేస్తున్నట్లు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి షాజహానబాషా పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాల యం వద్ద రుచిర సంస్థ యజమాని గోను కుంట్ల రామాంజులు, వెంకటరమణ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార రథాన్ని షాజహానబాషా, టీడీపీ సీనియర్ నాయకుడు మార్పురి సుఽధాకర్నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాలకు ఈ ప్రచార రథం వెళుతుందన్నారు. మదనపల్లెలో కూటమి అభ్యర్థి గెలుపుతో రాష్ట్రంలో చంద్రబా బును సీఎం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఆర్జే వెంకటేశ, ఎం.నాగ య్య, దుర్గాప్రసాద్, షంషీర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా టీడీపీ నేత జన్మదిన వేడుకలు
రాజంపేట పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వై.దొరస్వామినాయుడు జన్మదిన వేడుక లు ఘనంగా నిర్వహించారు. అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో షాజహానబాషా సమక్షంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపె ట్టారు. అలాగే టీడీపీ నాయకుడు రాజేష్ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. కార్యక్రమంలో బాలుస్వామి, పూల మురళి, హసీనా తదితరులు పాల్గొన్నారు.