సీఎం జగనకి ఓటమి భయం పట్టుకుంది
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:13 AM
ముఖ్యమంత్రి జగనకి ఓటమి భయం పట్టుకుని సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి విమర్శించారు.
వాల్మీకిపురం, ఫిబ్రవరి 24: ముఖ్యమంత్రి జగనకి ఓటమి భయం పట్టుకుని సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని వాల్మీకిపురం మండల టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి విమర్శించారు. శనివారం వాల్మీకిపురం పట్ట ణంలోని కోనేటివీధి, చాకలవీధి, గాంధీపేటలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రజలకు వివరిస్తూ టీడీపీని గెలిపించి చంద్ర బాబును మళ్లీ సీఎం చేయాలని కోరారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోవు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పీలేరు నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం రాను న్న ఎన్నికల్లో నల్లారి కిశోర్కుమార్రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్య త ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, పీలేరు తెలుగు యువత ఉపాధ్యక్షుడు లంకిపల్లి మధు, మైనార్టీ అధ్య క్షుడు సయ్యద్, నాయకులు రాజేంద్రాచారి, పీవీ నారాయణ, వల్లిగట్ల వెంకటరమణ, చంద్రమౌళి, కోసూరి రమేష్, స్వర్ణలత, మురళి, న్యాయవాధి రమణ, కువైట్ సయ్యద్బా షా, బొక్కసం ఆనంద్, చాను, రామాంజులురెడ్డి, సాదిక్, డిష్బ్రదర్స్,సర్దార్, మౌలా, సైదు, బషీర్, రమణ, అబ్బాస్, సయ్యద్అమీర్, లోకేష్, మస్తానవలి, ఆదినారాయణ, రెడ్డిరామ్, తదితర టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.