Share News

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: పుట్టా

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:06 AM

శాసనసభ్యునిగా ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపిస్తే కొత్తపల్లె గ్రామంతో పాటు మండలాన్ని అభివృద్ధిపథం వైపు తీసుకెళతానని మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు.

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా: పుట్టా
ప్రజలకు అభివాదం చేస్తున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌

బ్రహ్మంగారిమఠం, ఫిబ్రవరి 19 : శాసనసభ్యునిగా ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపిస్తే కొత్తపల్లె గ్రామంతో పాటు మండలాన్ని అభివృద్ధిపథం వైపు తీసుకెళతానని మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పి.కొత్తపల్లెలో పెద్దలు, స్నేహితులు, బంధువులు టీడీపీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పదవి లేకున్నా దాదాపు రూ.50 కోట్ల వరకు నిధులు వ్యయం చేశానన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టో గురించి వివరించా రు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బా రెడ్డి, చిలమల నాగయ్య, వేల్పుల సుదర్శన్‌, రాజేశ్వర్‌రెడ్డి, బుజ్జి, బాలదుగ్గిరెడ్డి, శ్రీను, దాసు, సుబ్బరామశర్మ, నాగరాజుస్వామి, వీర య్య, రాజారెడ్డి, వీరారెడ్డి, రామసుబ్బయ్య, చిన్న, చెన్నయ్య, రామకృష్ణ, బాలాజీరెడ్డి, ఎం.దుగ్గిరెడ్డి, పూజా శివయ్యయాదవ్‌, ఎర్రంపల్లి రవి, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:06 AM