Share News

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:40 PM

ఎన్నికల విధు ల్లో ఉన్న నాలుగు ప్రత్యే క బృందాల్లోని అధికారు లు 24గంటలు అప్రమ త్తంగా ఉండాలని రిట ర్నింగ్‌ అధికారి, ఆర్డీవో హరిప్రసాద్‌ సూచించారు.

ఎన్నికల విధుల్లో  అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో హరిప్రసాద్‌

మదనపల్లె టౌన, మా ర్చి 22: ఎన్నికల విధు ల్లో ఉన్న నాలుగు ప్రత్యే క బృందాల్లోని అధికారు లు 24గంటలు అప్రమ త్తంగా ఉండాలని రిట ర్నింగ్‌ అధికారి, ఆర్డీవో హరిప్రసాద్‌ సూచించారు. శుక్రవారం స్థానిక సబ్‌ కలెక్టరేట్‌లో ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీ, వీవీటీ, ఎస్‌ఎస్‌టీ అధికారులతో సమా వేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీల కార్యక్రమాలపై నిఘా వుంచాలన్నారు. ఎన్ని కల నియమావళి ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలన్నారు. ముఖ్యంగా ఎంపీ లాడ్స్‌ నిధుల పనులు చేయకూడదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రూ.38 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు మించకుండా ఎన్నికల ఖర్చు చేయాలన్నారు. అలా కాకుండా పరిమితి దాటితే ఆ అభ్యర్థిని అన ర్హుడుగా ప్రకటిస్తామన్నారు. డీఎస్పీ ప్రసాదరెడ్డి తరపున తాలూకా సీఐ శేఖర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో వుండే రాజకీయ పార్టీ నాయకులు రూ.50వేలు మించి నగదు తీసుకెళ్లరాదన్నా సామాన్య ప్రజలు రూ.10లక్షల వరకు నగదు తీసుకెళ్లవచ్చన్నారు. రూ.10లక్షలు దాటితే దానికి తగిన రసీదులు చూపించాలన్నారు. నాలుగు బృందాల అధికారులు తనిఖీ చేసే సమయంలో తప్పని సరిగా వీడియో చిత్రీక రించాలన్నారు. ఎన్నికల ప్రచార సామగ్రి కూడా రూ.10వేల లోపు వుంటే అనుమతిస్తామని, ఎక్కువుంటే అభ్యర్థి ఖర్చులో లెక్కిస్తార న్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, తహసీల్దార్లు రమాదేవి, బాలాజిరాజు, శ్రీనివాసులు, ఎంపీడీవోలు భానుప్రసాద్‌, షెల్లెట్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:40 PM