టీడీపీ హయాంలోనే బీసీలకు గుర్తింపు
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:48 PM
టీడీపీ హ యాంలోనే బీసీలను గుర్తించారని రైల్వే కోడూరు టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వ నాథనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు అన్నారు. జ

రైల్వేకోడూరు, జనవరి 12: టీడీపీ హ యాంలోనే బీసీలను గుర్తించారని రైల్వే కోడూరు టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వ నాథనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు అన్నారు. జ యహో బీసీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాల యంలో నిర్వహించిన సమావేశంలో వా రు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు ఒక్క దానికీ విధులు, నిధులు లేవని ఆరోపిం చారు. ఓట్ల కోసమే వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందన్నారు. బీసీ లను నిజంగా గుర్తించింది టీడీపీయే అని తెలిపారు. బీసీల్లో అవగాహన, చైతన్యం తెచ్చేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి మద్దతు పలకాలని కోరా రు. రాష్ట్ర బీసీ నాయకులు కమతం నాగ రాజుయాదవ్, నాయుడోరి రమణ, జన సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రాజంపేట పార్ల మెంట్ బీసీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర యాదవ్, మాజీ సర్పంచ్ మలిశెట్టి ముర ళీధర్ గౌడ్, గుత్తికొండ త్యాగరాజు, బరతాల శ్రీధర్, కన్వీనర్ వలసాని గుండాల య్య, బాలక్రిష్ణయాదవ్, దొమ్మలపాటి గోపాల్, చంద్రశేఖర్, సిద్ధేశ్వర, శివ పాల్గొన్నారు. అనంతరం స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ర్యాలీగా వెళ్లి జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఏటా జనవరి 1న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పిన సీఎం ఇంతవరకు దాని ఊసే ఎత్తలేదన్నారు.