Share News

అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటనకు ఘన నివాళి

ABN , Publish Date - May 15 , 2024 | 09:53 PM

అపర భగీథుడు సర్‌ అర్థర్‌ కాటన జయంతి సందర్భంగా బుధ వారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిరు.

అపర భగీరథుడు సర్‌ ఆర్థర్‌ కాటనకు ఘన నివాళి
కాటన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

వాల్మీకిపురం, మే 15: అపర భగీథుడు సర్‌ అర్థర్‌ కాటన జయంతి సందర్భంగా బుధ వారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిరు. వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కాట న చిత్రపటానికి పూలమాల లు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఇబ్బంది పడుతు న్న గోదావరి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మార్చారన్నారు. వందలాది గ్రామాలకు సాగు తాగునీరు అందించిన ఘనత కాటనకు దక్కుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్‌, ప్రిన్సిపాల్‌ ఉమా అమరేశ్వరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 09:53 PM