అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:33 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీమ్రావ్ అంబే డ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ ముఖ్య మంత్రి, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కిరణ్కు మార్రెడ్డి పేర్కొన్నా రు.
మదనపల్లె టౌన, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీమ్రావ్ అంబే డ్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ ముఖ్య మంత్రి, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కిరణ్కు మార్రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా మదనపల్లెకు వచ్చిన కిరణ్కుమార్రెడ్డి స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద అంబే డ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజే పీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేశ, ప్రధాన కార్యదర్శి యల్లంపల్లె ప్రశాంత, సీనియర్ నాయకుడు జేకే వర్మ, భగవాన, పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లె రవి, రూరల్ అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు. మదన పల్లె ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహానబాషా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించారు ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ఆర్డీవో హరిప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రిలో ఎంఎస్ డాక్టర్ రాజు చేతుల మీదుగా రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.
బహుజన సేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటు
మదనపల్లె అర్బన, ఏఫ్రిల్ 14:మదనపల్లె లోని దిగువకమ్మపల్లెలో బహుజ న సేన ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నివాళులర్పించారు. కార్యక్రమంలో బహుజనసేన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీచందు, ఆనంద్, పోర్డులలితమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కాలనీ గేట్లో అంబేడ్కర్ విగ్రహానికి బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ తోపాటు బాస్ నాయ కులు, బీటీ కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత ్నం, సీనియర్ అసోసి యేషన నేత తిరుమలరావు, బార్ అసోసియేషన సభ్యుడు సోమశేఖర్, జిల్లాకన్వీనర్ ముత్యాలమోహన, రమణఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మదనపల్లె ఎమెల్యే అభ్యర్థి మల్లెల పవనకుమార్రెడ్డి తన అనుచరులతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహా నాడు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు యమాల చంద్రయ్య, గుండామనోహర్, మల్లెలమోహన, లక్ష్మీపతి, రామచంద్ర, శ్రీరాములు, పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అంబేడ్కర్ చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు.
పీలేరులో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం పీలేరు, కేవీ పల్లె మండలాల్లో ఘనంగా నిర్వ హించారు. రెండు మండ లాల్లోని వివిధ ప్రజా, దళిత, విద్యార్థి సం ఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రభు త్వ అధికారులు ఆయనకు ఘ నంగా నివాళులర్పించారు. కేవీపల్లె మండలం కేవీపల్లెలోని .అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భి ణులు, బాలింతలు, రోగులకు హ్యూమన రైట్స్ ఆర్గనైజేషన, మాలమహానా డు నాయకులు పాలు, పండ్లు, మజ్జిగ వితరణగా అంద జేశారు. వేడుకల్లో పీలేరు తహసీల్దారు మహబూబ్ బాషా, అర్బన సీఐ మోహన రెడ్డి, మాలమహానాడు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఏపీసీపీ ఎస్ఈఏ, ముస్లిం జేఏసీ, ఎస్టీయూ, యూటీఎఫ్, భారతీయ అంబేడ్కర్ సేన, ఏపీ గిరిజన సమాఖ్య, దళిత విద్యార్థి సంఘాలు, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
కలికిరిలో: అంబేడ్కర్ జయంతి వేడుకలను కలికిరిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రప టా న్ని చాందినీ బండిలో వుంచి మేళతాళాలు, డప్పులు, ఇతర వాయిద్యాల మధ్య పట్టణంలో ఊరేగించారు. మదనపల్లె డివిజన అంబేడ్కర్ సంఘం, కలికిరి అంబేడ్కర్ సంఘం, ఎస్సీ ఉద్యోగల సంఘం, అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంసీ రమణ, రవీంద్ర, జయరామ్, రెడ్డిరాము, అగస్తి, పెద్దన్న, సిద్దయ్య, రామకృష్ణ, ఎన్టీ రమణ, గోవిందు, హరి అంబేడ్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కురబలకోటలో:మండలంలోని అంగళ్ళు టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్ ఆధ్వర్యంలో పం చాయతీ కార్యాలయం పక్కన దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ 133వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళిత సంఘనేతలు కుమార్, నరసింహులు, మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర టీడీపీ యువత అధ్యక్షుడు శ్రీరాంచినబాబు అంబే డ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాల న్నా రు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జేవెంకటేష్, దొరస్వామి నా యుడు, రమణ, రాజన్న, లక్ష్మన్న, రఫి, చినబాబు, రామకృష్ణ పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: ప్రతి పౌరుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలని ఎంపీడీవో వెంకటరమణయ్య, ఎంఈవో రామకృష్ణలు పేర్కొ న్నారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయం, పోలీసుస్టేషన, ఎమ్మార్సీల లో పాటు రాజ్యంగకర్త అంబేడ్కర్ జయంతిని జరుపుకున్నారు. ఎస్ఐ చెన్నకే శవ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలకడలో:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ జయంతి కలకడలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మాల మహానాడు ఐక్యవే దిక, మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో దళితసంఘాల నాయ కులు దామోదరం, రెడ్డికిరణ్, మల్లికార్జున, శ్రీనివాసులు, హరినాథ్, రజినీ కాంత, రాంబాబులు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాలలో టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, రమణ, చంద్రమౌళి, పీవీ నారాయణ, వల్లిగట్ల వెంకటరమణ, రమేష్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు