సెలవులు పూర్తి కాకుండానే అడ్మిషన్లు అక్రమం
ABN , Publish Date - May 27 , 2024 | 09:53 PM
ముందస్తుగా అడ్మిషన్లతో విద్యావ్యాపారం చేస్తున్నా రంటూ రాజంపేట పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట ఎస్ ఎఫ్ఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడం దారుణమన్నారు.
![సెలవులు పూర్తి కాకుండానే అడ్మిషన్లు అక్రమం](https://media.andhrajyothy.com/media/2024/20240511/2rjp27_jpeg_8ec4ea9872.gif)
రాజంపేట, మే 27 : ముందస్తుగా అడ్మిషన్లతో విద్యావ్యాపారం చేస్తున్నా రంటూ రాజంపేట పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట ఎస్ ఎఫ్ఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడం దారుణమన్నారు. వేసవి సెలవులు పూర్తి కాకుండానే అడ్మిషన్లు నిర్వహిం చడం అక్రమం అన్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ ఇలాగే చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎప్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాయకులు నరసింహ,పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రావు, రమణ, చెంగయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.