Share News

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:01 PM

మండలంలోని సరస్వతిపల్లె హరిజనవాడకు చెందిన 30 కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు.

30 కుటుంబాలు టీడీపీలో చేరిక
టీడీపీలో చేరిన సరస్వతిపల్లె నాయకులు

రామాపురం, మార్చి4: మండలంలోని సరస్వతిపల్లె హరిజనవాడకు చెందిన 30 కుటుంబాలు సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు టీడీపీ రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆ గ్రామ నాయకుడు గడికోట భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాయ చోటిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడు తూ 45 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఎ మ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ నాయకులు గడికోట అనంతరెడ్డి, డేగల శివయ్య, చెన్నూ రు అన్నయ్య, వెంకటసుబ్బయ్య, బసిరెడ్డి, రాజారెడ్డి, పెంచలయ్య, సోమ నాఽథం, చెమినేని ప్రభాకర్‌, డేగల వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

రాచపల్లె, గంగనేరు గ్రామస్తులతో భేటీ

రామాపురం మండలం రాచపల్లె వడ్డెపల్లి 58వ వార్డు మెంబర్‌ నారాయ ణమ్మ ఆమె కుమారుడు వేణుగోపాల్‌, గ్రామ ప్రజలు శ్రీనివాసులు, బాలాజీ, జయరాం, భాస్కర్‌, నవీన్‌, రవి, సురేశ్‌, శివనాగేంద్ర, రెడ్డిశేఖర్‌ తదితరులు సోమవారం రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డిని కలిసి మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే పేద, బడుగు వర్గాలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్‌, జయరాం, శ్రీనివాసులు, బాలాజీ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

’మైనార్టీ మహిళ’తో ఆత్మీయ సమావేశం

రాయచోటిటౌన్‌: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాలను స్వయంగా కలుస్తూ మద్దతును అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం టీడీపీ సీనియర్‌ నేత గీతా బీడీ యజమాని నసీబ్‌జాన్‌ను కొత్తపల్లిలోని ఆమె ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం 6వ వార్డులో రాజకీయ పరిస్థితులపై ముచ్చటించారు. ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని, టీడీపీ విజయానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్‌ సగీర్‌, ఇమ్రాన్‌, జాఫర్‌, ఆసిఫ్‌, జనసేన నవీన్‌, కొండా భాస్కర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, పలువురు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:01 PM