Share News

కులం పేరుతో తిట్టి దాడి చేశారనే ఫిర్యాదుపై విచారణ

ABN , Publish Date - May 25 , 2024 | 01:16 AM

కులం పేరుతో తిట్టి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ రమేష్‌బాబు శుక్రవారం విచారణ చేపట్టారు.

కులం పేరుతో తిట్టి దాడి చేశారనే ఫిర్యాదుపై విచారణ

తెనాలి రూరల్‌, మే 24: కులం పేరుతో తిట్టి దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై డీఎస్పీ రమేష్‌బాబు శుక్రవారం విచారణ చేపట్టారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన ఉన్నం అరుణ్‌కుమార్‌ అతడి స్నేహితులు కూచిపూడి కిరణ్‌, ఉన్నం గోపిలు గురువారం ఖాజీపేట వద్ద ఉన్న పెట్రోల్‌ బంకులో తన ద్విచక్రవాహనానికి ఆయిల్‌ కొట్టించుకునేందుకు వెళ్లారు. గతంలో అతడితో వివాదం ఉన్న ముగ్గురు యువకులు అరుణ్‌కుమార్‌ని కులం పేరుతో అసభ్యకరంగా తిట్టి దాడిచేశారని బాధితుడు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్ట్‌ (కులదూషణ) కింద కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై డీఎస్పీ రమేష్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ కోటేశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ప్రత్యక్ష సాక్షుల నుండి వివరాలు సేకరించారు.

Updated Date - May 25 , 2024 | 07:26 AM