రెండు రైళ్ల దారి మళ్లింపు
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:25 PM
ఇంజనీరింగ్ వర్కులు కారనంగా రెండు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ వర్కులు కారనంగా రెండు రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 12756 భావనగర్ - కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ రైలుని ఈ నెల 8, 15, 22, 29 తేదీల్లో ఏలూరు, తాడేపల్లిగూడెం మార్గంలో కాకుండా గుడివాడ మీదగా మళ్లిస్తామన్నారు. నెంబరు.12806 లింగంపల్లి - విశాఖపట్టణం జన్మభూమి ఎక్స్ప్రెస్ని కూడా ఈ నెల 8, 9, 11, 12, 15, 15, 18, 19, 22, 23, 25, 26, 29, 30 తేదీల్లో గుడివాడ మీదగా మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.