Share News

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - May 16 , 2024 | 01:25 AM

మండలంలోని నరసరావుపేట-చిలకలూరిపేట రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్మ ఈశ్వర్‌కృష్ణ ప్రసాదు (25) అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. నాదెండ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ విద్యార్థి మృతి

నాదెండ్ల, మే 15: మండలంలోని నరసరావుపేట-చిలకలూరిపేట రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కమ్మ ఈశ్వర్‌కృష్ణ ప్రసాదు (25) అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. నాదెండ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట పట్టణంలోని సాయినగర్‌కు చెందిన కమ్మ శివరామప్రసాదు కుమారుడు ఈశ్వర్‌ కృష్ణ ప్రసాదు బెంగుళూరులో బీటెక్‌ చదువుతున్నాడు. మంగళవారం నరసరావుపేట నుంచి చిలకలూరిపేటలో ఉన్న తన అమ్మమ్మను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కనపర్రుబావి సమీపంలో బుల్లెట్‌కు ఆటో తగలటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని నరసరావుపేటలోని ఒక వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బాలరామిరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 08:20 AM