అవినీతిపరుల ఆటకట్టిస్తా
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:56 AM
బాపట్ల నియోజకవర్గంలో ప్రజలకు సేవలందించేందుకు లంచాలకు చేయి చాపే అధికారుల ఆటకట్టిస్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు.
![అవినీతిపరుల ఆటకట్టిస్తా](https://media.andhrajyothy.com/media/2024/20240604/07bpt05a_3884cbc193.gif)
కర్లపాలెం, జూన్ 7 : బాపట్ల నియోజకవర్గంలో ప్రజలకు సేవలందించేందుకు లంచాలకు చేయి చాపే అధికారుల ఆటకట్టిస్తామని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి శుక్రవారం వస్తున్న సందర్భంగా కర్లపాలెం ఐలెండ్ సెంటర్లో వందలాదిమంది కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు, అభిమానులు నరేంద్రవర్మకు ఎదురేగి పూలజల్లులతో ఘనస్వాగతాలు పలికారు. భారీ స్థాయిలో బాణాసంచా పేల్చారు. నరేంద్రవర్మ పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బాపట్ల నియోజకవర్గంలో 27,800 భారీ మెజార్టీతో గెలిపించిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీకోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని, రాబోయే 5 సంవత్సరాలలో ఉన్నతమైన శాసన సభ్యునిగా, మంచి ప్రజాసేవకునిగా ప్రజలకు జవాబుదారిగా నియోజకవర్గ ప్రజల అభి మానాన్ని చూరగొంటానన్నారు. మండలంలోని అన్ని వర్గాల ప్రజలు, ఆయా పార్టీల నాయకులు, పలువురు మహిళలు, పలుశాఖల అధికారులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపూరి భూపతిరావు, నక్కల వెంకటస్వామి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాలరెడ్డి, పిట్ల వసంతరెడ్డి, షేక్ బాజి, గుంపుల కన్నయ్య, బెజ్జం వెంకటేశ్వర్లు, జనసేననాయకులు చిలకల సురేంద్రబాబు, నామన వెంకటశివన్నారాయణ, పెదమల్లు గంగరాజు, పెదమల్లు వెంకటేష్, పెదమల్లు తాతయ్య, సర్పంచ్ పీటా శ్రీనివాసరావు, రావి సుబాష్, కుంచాల నాగిరెడ్డి, మద్దాల ముసలయ్య, తాజా, పఠాన్అహ్మద్బాషా, కృష్ణారెడ్డి, కట్టా సుజాత, మాడా శ్రీనివాసరావు, దొప్పలపూడి రాజశేఖర్, జిలా నీ, అంగిరేకుల ఏడుకొండలు, పేరలి ధనుంజయ, బొద్దుకూరి విజ య, బుల్లియ్య, ఎమ్మెల్యే బాషా, చిలకా శ్రీను, కోమట్ల చలపతిరెడ్డి, మండలంలోని టీడీపీ నాయకులుపాల్గొన్నారు.