యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు తొలి సంతకం
ABN , Publish Date - Jun 08 , 2024 | 01:00 AM
యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైన పెట్టనున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు.
![యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు తొలి సంతకం](https://media.andhrajyothy.com/media/2024/20240604/05bpt03a_9d16571c61.gif)
గుంటూరు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపైన పెట్టనున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె పశ్చిమ కార్యాలయం వద్ద యువత ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని, ఒక్క విశ్వవిద్యాలయం, ఒక్క పరిశ్రమ తీసుకొనిరాలేదని, ఏపీ యువతకు ఫిష్ ఆంధ్ర, వలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చి భవిషత్తును సర్వనాశనం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో పరిశ్రమలు ఏపీకి క్యూ కట్టేవని, మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడంతో స్వర్ణయుగం మొదలు అయ్యిందని హర్షం వ్యక్తం చేసారు.
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన గళ్లా మాధవిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభినందించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత తొలిసారిగా దంపతులు ఇద్దరు గురువారం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. చంద్రబాబుకు గళ్లా మాధవి, రామచంద్రరావులు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే టీడీపీ యువనేత నారా లోకేశను గళ్లా మాధవి కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.