Share News

సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి

ABN , Publish Date - May 30 , 2024 | 12:38 AM

ఎన్నికల కమిషన నియమాలకు వ్యతిరేకం గా మాట్లాడటమేకాక లెక్కింపు కేంద్రాలలో అలజడులు సృష్టించాలని వైసీపీ ఏజెంట్లను రెచ్చగొడుతూ మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కన పర్తి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి

గుంటూరు, మే 29(ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన నియమాలకు వ్యతిరేకం గా మాట్లాడటమేకాక లెక్కింపు కేంద్రాలలో అలజడులు సృష్టించాలని వైసీపీ ఏజెంట్లను రెచ్చగొడుతూ మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కన పర్తి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గుంటూరులో బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడారు. ఓటమి తప్పదని తెలుసుకున్న జగనరెడ్డి నిలువెల్లా భయంతో వణికిపోతూ వైసీపీ నాయకులను, కార్యకర్తలను లెక్కింపు కేంద్రాలలో అలజడులు సృష్టించాలని పక్కాగా ప్రణాళిక రూపొందించాడని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన వెంటనే స్పందించి సజ్జల వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కిం పు కేంద్రంలో అభ్యర్థిని సైతం అరెస్టు చేసి, వైసీపీ గూండాలు లోపలికి చొరబడి అలజడి సృష్టించిన విషయాన్ని ఎన్నికల కమిషన మర్చిపోకూడదన్నారు. జగన, సజ్జల, సాయిరెడ్డి నేర ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని ఈసీ ముందుచూపుతో వ్యవహరించాలని అన్నారు. ప్రతీ లెక్కింపు కేంద్రం వద్ద కేంద్ర బలగాలు అప్రమత్తంగా ఉండే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన చొరవ చూపాలని కోరారు. ఒడిస్సాలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే జైలు కెళ్ళాడని, ఏపీలో మాత్రం ఎందుకు సాధ్యం కాలేదో న్యాయ కోవిదులు, మేధావులు ఆలోచించుకోవాలని అన్నారు. రెండు రాషా్ట్రల ఎఫ్‌ఐఆర్‌ లలో ఒకే సెక్షన్లు ఉన్నప్పటికీ, ఇక్కడి అరాచక ఎమ్మెల్యే పిన్నెల్లికి మాత్రం ఊరట లభించటం ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలని కనపర్తి అన్నారు.

Updated Date - May 30 , 2024 | 12:38 AM