Share News

ఐఎంఏకు రూ.5.40లక్షల విరాళం

ABN , Publish Date - May 31 , 2024 | 01:32 AM

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెనాలి శాఖకు రూ.5.40 లక్షలు చెక్కును డాక్టర్‌ సీఎ్‌సఆర్‌కే ప్రసాద్‌ హేమలత దంపతులు బహూకరించారు.

ఐఎంఏకు రూ.5.40లక్షల విరాళం
ఐఎంఏకు చెక్కు అందజేస్తున్న ప్రసాద్‌

తెనాలి అర్బన్‌, మే 30: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెనాలి శాఖకు రూ.5.40 లక్షలు చెక్కును డాక్టర్‌ సీఎ్‌సఆర్‌కే ప్రసాద్‌ హేమలత దంపతులు బహూకరించారు. గురువారం బోసురోడ్డులోని ఐఎంఏ హాలులో చెక్కును అధ్యక్ష, కార్యదర్శులు శ్రీలక్ష్మి, పవని ప్రియాంక, వైద్యులు అనీల్‌కుమార్‌, శ్యాంప్రసాద్‌లకు అందజేశారు. ఈ చెక్కు డిపాజిట్‌ చేసి ఏటా వచ్చే వడ్డీతో ఒక వైద్య నిపుణునికి బంగారు పతకం అందజేయడం, తెనాలి వైద్యులకు ఆర్థిక వైద్య విధానాలపై సదస్సు నిర్వహించడం చేయాలని కోరారు.

Updated Date - May 31 , 2024 | 01:32 AM